కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా...

కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా...

ముద్ర, మల్యాల: మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని మల్యాల సర్పంచ్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్ తెలిపారు. ఆయన సోదరుడు ఆధ్యాత్మిక వేత్త, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి మిట్టపల్లి లక్ష్మీనారాయణ కుమారుడు మిట్టపల్లి సంతోష్ (USA) శుక్రవారం విద్యార్థుల సౌకర్యార్దo కళాశాలకు 30 డెస్క్ బెంచీలు అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ కళాశాల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే పనులు జరిగేలా చూస్తానన్నారు. మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దాదాపు ఒక లక్ష 10 వేల విలువ గల డెస్క్ బెంచీలు డొనేట్ చేసినట్లు ప్పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో 20 డెస్క్ బెంచీలు కూడా తొందరలోనే అందజేస్తా అన్నారు. అనంతరం కళాశాల సిబ్బంది లక్ష్మీనారాయణ దంపతులకు సన్మానo చేశారు. కాగా, గ్రామ అభివృద్ధి, స్థానిక దేవాలయాల్లో సౌకర్యాలు కల్పించడం కోసం మిట్టపల్లి సంతోష్ (USA) ముందుకు వచ్చి, తన వంతుగా  సహాయసహకారాలు అందిచడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపల్లి విమల, కళాశాల ప్రిన్సిపాల్ శివరామ కృష్ణ , గాజుల మల్లేశం, కుర్రె శంకర్, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.