శిలాఫలకంపై జెడ్పి చైర్ పర్సన్ పేరు లేకపోవడం బాధాకరం

శిలాఫలకంపై జెడ్పి చైర్ పర్సన్ పేరు లేకపోవడం బాధాకరం
  • ఇది ముమ్మాటికి బహుజన మహిళలను అవమానించడమే
  • ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు అధికారులను బలి చేస్తారా
  • కాన్సిల్ లో 11 మంది బిసి మహిళల్లో ఒకరు అర్హులు కాదా .. ఓసినే చైర్మన్ గా కొనసాగిస్తార 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డా. బోగ. శ్రావణి అన్నారు. కేంద్ర గిడ్డంగుల,50 పడకల క్రిటికల్ శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకంపై జడ్పీ చైర్ పర్సన్ పేరు తొలగించడం వెనక కుట్ర కోణం దాగి ఉందని, జెడ్పి చైర్పర్సన్ బహుజన మహిళ అయినందున పేరు పెట్టక పోవడం, మహిళలకు జరిగిన అన్యాయమని, జగిత్యాల మహిళలకు ఒక బ్లాక్ డే అని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఒక హింసించే పులకేసి అని ఆయనకు బహుజనులు అంటే చులకన అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే బహుజనులను రాజకీయంగా ఎదగనీయరని ఆయనకు కేవలం సబ్బండ వర్గాల ఓట్లు మాత్రమే కావాలని అన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తనను అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు వేధించడం వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా కౌన్సిల్ లో ఉన్న మిగితా 11 మంది బీసీ మహిళ కౌన్సెలోర్లను కాదని ఒక ఓసి సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ గా బాధ్యతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఖాళీగా ఉన్న రూరల్ అర్బన్ ఎంపీపీ పదవులను కూడా రిజర్వేషన్లకు విరుద్ధంగా ఇతరులకు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట కనిపించే ఎమ్మెల్యే ఒక డాక్టర్ లోపల మరో యాక్టర్ ఉన్నాడంటూ ఎద్దేవా చేసారు. జగిత్యాల ఎమ్మెల్యే వ్యక్తిత్వం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముందు ఈరోజు ప్రత్యక్షంగా బయటపడిందని విమర్శించారు. జిల్లాలో ఎక్కడ ప్రోటోకాల్ గొడవ జరగదు కేవలం జగిత్యాల నియోజకవర్గం లొనే జరుగుతుంది ఎందుకు? దానికి  బాధ్యులు మీరు కదా అని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.