ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై డిఎస్పి విచారణ

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై డిఎస్పి విచారణ

మెట్‌పల్లి ముద్ర:- ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై శనివారం డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి ఎర్దండి గ్రామంలో విచారణ చేపట్టారు. ఈనెల 24వ తేదీన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని మల్లన్న గుట్ట వద్ద అదే గ్రామానికి చెందిన నీరాటి రఘు, చిలుకూరి రాజేందర్ లు మద్యం సేవిస్తుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో నీరటి రఘు పై చిలుకూరి రాజేందర్ దాడి చేసి కులం పేరుతో దూషించాడని నీరటి రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. ఇబ్రహీంపట్నం ఎస్సై ఉమా సాగర్ కేసు నమోదు చేయగా. డీఎస్పీ సంఘటన స్థలాన్ని సందర్శించి అక్కడ విచారణ చేపట్టారు. ఆయన వెంట ఎస్ ఐ ఉమా సాగర్ ఉన్నారు.