అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి... కుళ్లిపోయిన మృతదేహం

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి... కుళ్లిపోయిన మృతదేహం

మెట్‌పల్లి ముద్ర: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాంనగర్ లో కొత్తపేట గణేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గణేష్ గత కొంత కాలం క్రితం గల్ఫ్ దేశం నుండి వచ్చి స్థానికంగానే ఉండి పనులు చేసుకుంటున్నాడు. గణేష్ బార్య అతనితో గొడవ పెట్టుకొని గత కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది, గురువారం గణేష్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు  ఇంటి తలుపులు తీసి చూసేసరికి గణేష్ మృతి చెంది కుళ్ళిన స్థితిలో ఉన్నాడు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ  చేస్తున్నారు. దుర్వాసన రావడంతో గణేష్ మూడు,నాలుగు రోజుల క్రితం మరణించినట్లు స్థానికులు పోలీసులు, భావిస్తున్నారు. ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని  స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.