బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం...

బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం...

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: జిల్లా కేంద్రాల్లో తసిల్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో టి ఎస్ పిఎస్సి పేపర్ లీకేజీ , నిరసన తెలిపిన బీజేవైఎం నాయకుల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రెంటం జగదీష్ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల జీవితాల ను నాశనం చెసే విధంగానే టిఎస్పిఎస్సి లీకేజీ జరిగిందని నిరుద్యోగ యువతకు అండగా ఉంటున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్, నాయకులను ఆ ప్రజాసామ్యంగా జైలు పంపడం నిరంకుశ ప్రభుత్వానికి నిదర్శనం అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వనికీ చేతకాక ఈ లికేజ్ కి పాల్పడిందని, వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తొలగించాలని, ఎవరైతో లికెజ్ కి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చెసి చట్ట పరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి మంచి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు ఉమేష్, కోశాధికారి రంజిత్ రెడ్డి, కార్యదర్శి సాడిగే మహేష్ , సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రుద్ర విఘ్నేష్, మండల అధ్యక్షుడు రవితేజ, శ్రీనివాస్,ప్రమోద్, రాజు, వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు.