ఉత్సవాల పేరుతో లక్షలు వృదా..

ఉత్సవాల పేరుతో లక్షలు వృదా..

ఒక్క గాలి వానకే కూలిన తోరణాలు..
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం...
తప్పిన ప్రమాదం...

మెట్‌పల్లి ముద్ర: ఉత్సవాల పేరుతో లక్షలు ఖర్చు పెట్టి స్వామి (ఎమ్మెల్యే కల్వకుంట్ల) పై భక్తిని చాటుకునేందుకు మున్సిపల్ అధికారలు మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ కి సంబందించిన పెద్ద పెద్ద తోరణాలు చేయించి ప్రధాన రోడ్ల పై ఏర్పాటు చేశారు. కానీ ఆ స్వామి భక్తి ఒక్కరోజు కూడా నిలవలేకపాయింది.

ఆదివారం సాయంత్రం కురిసిన గాలివానకు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన తోరణాలు నేలకొరిగాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తో  మెట్‌పల్లి పట్టణంలోని డిపో ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం గాలివానకు  ఓ ఆటోపై పడడంతో పెను ప్రమాదం తప్పింది.కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తోరణాలు నేలకొరగడంతో రోడ్లపై ఎవరు లేకపోవడం తో ఎలాంటి ప్రమాదం జరగలేదు.