ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం తప్పదు.బిజేపి పట్టణ అధ్యక్షుడు రమేష్
![ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం తప్పదు.బిజేపి పట్టణ అధ్యక్షుడు రమేష్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b92a2e83732.jpg)
మెట్పల్లి ముద్ర: తెలంగాణ రాష్ట్రం లో రజాకార్ల పాలనను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అన్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావుల అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. బాట సింగారం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పరిశీలించడానికి వెళుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు లను అరెస్ట్ చేయడం అప్రజస్వామికం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే గొంతులను అరెస్ట్ లతో ఆపలేనన్నారు.
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని . కెసిఆర్ను గద్దె దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొమ్ముల రాజ్ పాల్,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చెట్లపెళ్లి సుఖేందర్ గౌడ్,కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, జె ఎన్ వెంకట్ పార్లమెంటు కన్వీనర్ గుంటుక సదాశివం, బీజేవైఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ధోనికెల నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేటి విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్ల గౌతం,యాదగిరి, భోగ గంగాధర్, బాబు, సొరపాక రమేష్, తోకల సత్యనారాయణ,శ్రీరామ్ శివ,పీసు రాజేందర్, కోయ్యల లక్ష్మణ్, లోలపు అనిల్, మద్దెల లావణ్య ,పుల్ల సౌజన్య ,సడిగే మహేష్, జుంగుల అనిల్, శ్రీనివాస్ ,బొడ్ల ఆనంద్ ,అనిల్, ఎదులాపురం కుమార్ అవినాష్ ,తిరుమల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.