ముస్లింల అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటా - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముస్లింల అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటా - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ముస్లింల అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈద్గా అభివృద్ధి పనులకు రు.10లక్షల ఎమ్మెల్సీ నిధులు మంజూరు కాగా మంగళవారం ఇందిరా భవన్ లో సెంట్రల్ ముస్లిం కమిటీ సభ్యులకు నిధుల  మంజూరు  పత్రాలు ఎమ్మెల్సి అందజేశారు. ఈద్గా అభివృద్దికి నిధులు మంజూరు చేసినందుకు ముస్లిం కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎండీ భారి, ప్రధాన కార్యదర్శి మన్సూర్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎం.డీ.జుల్ఫిన్, ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు ఎండీ.గయాస్, కాంగ్రెస్ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు నేహాల్, కౌన్సిలర్ ఎం.డీ. కమాల్, ముస్లిం సెంట్రల్ కమిటీ కార్యదర్శి రియాజ్ పాల్గొన్నారు.