ప్రజ్ఞాపూర్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ప్రజ్ఞాపూర్ లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విరూపాక శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా శనివారం నాడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, 108, ఫీజు రీఎంబర్స్మెంట్ ,ఆరోగ్యశ్రీ ,పెన్షన్ ఉచిత వైద్యం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేవని ఆయన అడుగుజాడల్లో నేటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉండాలని ఆయన ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు నేత, సీనియర్ నాయకులు జాంగిర్, అంజి యాదవ్, అకారం యాదగిరి, ఎస్సీ సెల్ నాయకులు శివుడు టిల్లు రెడ్డి, కాసారం బాబా కార్యకర్తలు పాల్గొన్నారు