సిద్దిపేట నుంచి వరంగల్ బయలుదేరిన బిజెపి శ్రేణులు

సిద్దిపేట నుంచి వరంగల్ బయలుదేరిన బిజెపి శ్రేణులు

జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించిన దూది శ్రీకాంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:  వరంగల్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొనేందుకు శనివారం రోజున సిద్దిపేట జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లాయి. సిద్దిపేటలో బిజెపి నాయకులు వెళ్లే వాహన శ్రేణిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి వారితో పాటే వరంగల్ బయలుదేరి వెళ్లారు. బిజెపి జిల్లా నేతలంతా ఆయన వెంట వరంగల్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.