రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం పలువురికి గాయాలు

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది కి గాయాలయ్యాయి క్షతగాత్రులందరినీ ములుగు లోని ఆర్విఎం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ములుగు సమీపంలో డీసీఎంను ఢీకొన్న ప్రమాదంలో దాదాపు పది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులందరిని ములుగు సమీపంలోని ఆర్విఎం ఆసుపత్రికి తరలించారు ములుగు ఎస్సై రంగకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.