దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి  స్టేట్ ఫస్ట్ ర్యాంకు

దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి  స్టేట్ ఫస్ట్ ర్యాంకు

దుబ్బాక,ముద్ర: దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ఇటి) గ్రూపు మొదటి సంవత్సర పరీక్షల్లో డి.సుకుమార్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మార్చి నెలలో జరిగిన వార్షిక పరీక్షల్లో విద్యార్ధి సుకుమార్ 500 మార్కులకు గానూ 491 మార్కులు సాధించి,రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం పొందాడు.

జూన్ లో నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో ఇంప్రూవ్ మెంట్ రాసి,496 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం పొందాడు.రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థి సుకుమార్ ను కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ,ఇ టి గ్రూపు లెక్చరర్ ఎ.  తిరుపతి రెడ్డి అభినందించారు.