ప్రధానమంత్రి సభకు బయలుదేరిన ఆలేరు నియోజకవర్గ నాయకులు
ఆలేరు ముద్ర : వరంగల్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభకు ఆలేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్, పఠాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తో కలిసి బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదగాని హరిశంకర్ గౌడ్, బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పడాల శ్రీనివాస్, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, మండల పదాదికారులు, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు ,కార్యకర్తలు తదితరలు ఉన్నారు.