కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి- వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి- వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

ముద్ర, వరంగల్ క్రైం: కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి సీపీ రంగనాథ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం  ప్రారంభించారు. రెండురోజుల పాటు నిర్వహించబడే ఈ కార్యక్రమములో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులు, కంటి వైద్యులను అడిగితెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సిబ్బందికి కంటి అద్దాలు, మందులను అందజేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ అవసరమని ముఖ్యంగా కంటి సమస్యల పట్ల అశ్రద్ధ వహించవద్దని, ముఖ్యంగా సిబ్బంది, వారి కుటుంబాల్లో కంటి సమస్యలు బాధపడుతున్న కుటుంబ సభ్యులకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించుకోవాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ డిసిపి య. ఏ బారీ, అదనపు డిసిపి సంజీవ్, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, ఉప వైద్యాధికారులు డాక్టర్లు చొక్కయ్య, మదన్మోహన్ ఏసిపి నాగయ్య, ఆర్.ఐలు నగేష్, భాస్కర్, యూనిట్ డాక్టర్ విద్యారెడ్డితో పాటు ఇతర పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.