మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థికసాయం

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్థికసాయం

ముద్ర ప్రతినిధి, వరంగల్ : నిన్న రాత్రి సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల, ఖానాపూర్ మండలానికి చెందిన బానోతు శ్రావణి నర్సంపేట మండలం చంద్ర్యయపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ ఉన్నారు.

ఈ సంఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడి మృతులకు పోస్ట్ మార్టం జరిపించాలని కోరారు.

  • పోస్ట్ మార్టం అనంతరం మృతుల భౌతిక కాయలను వారి స్వగ్రామానికి చేర్చడానికి అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టడం జరిగిందన్నారు.
  • ప్రమాదవశాత్తు మరణించిన మృతుల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పి ఓదార్చినట్లు తెలిపారు. అంతేగాకుండా  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం కింద వ్యక్తిగతంగా రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందించారు