స్కూల్ బస్, ఫార్చునర్ కార్ ఢీ పది మంది

స్కూల్ బస్, ఫార్చునర్ కార్ ఢీ పది మంది
  • విద్యార్థులకు గాయాలు
  • జడ్పీ ఫ్లోర్ లీడర్ కారుగా గుర్తింపు
  • పెద్ది స్వప్నకూ గాయాలు

ముద్ర ప్రతినిధి, వరంగల్: నర్సంపేట పట్టణంలో ని పాత్ ఫైండర్ స్కూల్ చెందిన బస్సు, వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఫార్చునర్ కార్ ఢీకొన్నాయి. బుధవారం నర్సంపేట శివారు కమలాపూర్ గ్రామ సమీపంలో ఈ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. పాత ఫైండర్ స్కూల్ కి చెందిన బస్సు సాయంత్రం పిల్లలను దించేందుకు స్కూల్ నుంచి బయలుదేరింది. సరిగ్గా కమలాపూర్ క్రాస్ బగ్గ వైన్స్ దగ్గర నల్లబెల్లి నుంచి నర్సంపేట వైపుకు వేగంగా వస్తున్న కార్ స్కూల్ బస్సును ఢీకొంది.

 ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది చిన్నారులు ఉండగా.. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఫార్చునర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న పెద్ద స్వప్న కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలకు ఏమైందో అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.