చారి కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలి

చారి కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలి
  • కోటంచలో ఆలయంలో ప్రత్యేక పూజలు
  • మహన్నదన0 చేసిన చారి అనుచరులు

ముద్ర న్యూస్ రేగొండ:-తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి అభిమాలు . ఎలాగైనా ఎమ్మెల్సీ చారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరుతూ బుధవారం రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయనికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు రానున్న రోజుల్లో మధుసూదన చారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు.2014 ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన చారి .భూపాల్ పల్లి ప్రజలను కంటికి రెప్పలా చుసుకున్నారని.వేళా కోట్ల నిధులు తీసుకు వచ్చి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేసారని తెలిపారు. స్కూలుకి వెళ్లే పిల్లాడి నుండి పండు ముసలి వరకు మధుసూదన చారి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లంకల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఈర్ల సదానందం, బోయిని వినోద్,ప్రభాకర్,ఇతర అభిమానులు పాల్గొన్నారు.