కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ పిలుపు...

కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ పిలుపు...

సోమవారం వరంగల్ లో జరిగిన హాథ్ సే హాథ్ జోడో లో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పాదయాత్ర లో టిఆర్ఎస్ గుండాలు, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు, యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై విచక్షణ రహితంగా దాడి చేసారు. రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విషమిస్తున్న టిఆర్ఎస్ గుండాల దౌర్జన్యాలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 

వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి టిఆర్ఎస్ గుండాల వైఖరిని ఎండగడుతూ నిరసనను విజయవంతం చేయాలని కోరారు.

దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన ఆయన అనుచరులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.