ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ
ముద్ర ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నూతన కమిటీ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టింది. ప్రెస్ క్లబ్ లో ఉదయం ముందుగా వేదపడింతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, ఆశీర్వచణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్ ఆధ్వర్యంలోఈసీ మీటింగ్ జరిగింది. కార్యదర్శి ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు సభ్యులంతా ఆమోదం తెలిపారు.
వరంగల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రెసిడెంట్లు గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు సంపెట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, బూర్ల నరేందర్, విష్ణువర్దన్, ఈసీలు హరీశ్,శ్రీకాంత్,అంజనేయులు, నయూంపాష, వేణుగోపాల్, దిలిప్,సంజీవ్, భరత్, మంచాల రాజు,విజయ్రాజ్ పాల్గొన్నారు.