శేఖర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి : జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి

శేఖర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి : జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :  రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ముచ్చటగా మూరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి  కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషిచేసి  పార్టీని మూడవసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు.  భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీకి దొరికిన ఆణిముత్యంఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉందని నేటి నుండి ఎలక్షన్స్ ముగిసే వరకు ప్రతి కార్యకర్త సైనికుడై పనిచేయాలన్నారు. 

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సంక్షేమ పథకాలు కార్యకర్తలు ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఓం ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ , పిఎసిఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, జడ్పిటిసి బీరు మల్లయ్య, రైతు సమన్వయ సమితి నాయకులు మల్లయ్య, ఏనుగు సంజీవ రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.