పథకాలే పార్టీని గెలిపిస్తాయి..

పథకాలే పార్టీని గెలిపిస్తాయి..
  • జీఎంఆర్ఎం ట్రస్టు చైర్మన్ గౌతమ్ రెడ్డి..
 
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే పార్టీని గెలిపిస్తాయని జీఎంఆర్ఎం ట్రస్టు చైర్మన్ గండ్ర గౌతమ్ రెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని నందిగామ, దీక్షకుంట, గొల్లబుద్దారం, కమలాపుర్ తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మెనిఫెస్టోలో ఉన్నవి అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 
రైతు బంధు రూ.16 వేలు, రేషన్ షాపులో సన్న బియ్యం, కేసిఆర్ భీమా రూ.5 లక్షలు, కల్యాణ లక్ష్మి పెంపు, కేసిఆర్ ఆరోగ్య రక్షా  రూ.15 లక్షలు, పేదింటి మహిళకు రూ. 3వేల ఫించన్, వంట గ్యాస్ సిలిండర్ రూ. 400లు తదితర పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామ గ్రామ సర్పంచ్ శ్యామ్, కమలాపుర్ సర్పంచ్ ప్రవీణ్, పార్టీ మండల అధ్యక్షులు పాలకుర్తి రఘుపతి గౌడ్, బుర్ర రాజు గౌడ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పింగిలి రవీందర్ రెడ్డి, లింగమళ్ళ బోస్, గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్ పటేల్, రఘు రెడ్డి, మేకల సంపత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.