ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక..

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి క్రీడా పోటీలలో స్థానిక సన్ వ్యాలి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో సన్ వ్యాలి పాఠశాల విద్యార్థులు అండర్ 14 విభాగములో ఎల్. అనిష్, అండర్ 17 విభాగములో ఎన్.అజయ్ కబడ్డీ విభాగంలో ఎంపిక కావడం జరిగింది. దీనికి ముందు జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో సన్ వ్యాలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భూపాలపల్లి జిల్లా స్థాయికి 14 మంది విద్యార్థులు కబడ్డీ , ఖోఖో, వాలీబాల్ విభాగాలలో ఎంపిక కావడం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. సతీష్, కరస్పాండెంట్ ఎం. సురేష్, ఫిజికల్ డైరెక్టర్ ఏ. రమేష్ లు అభినందించారు.