కంఠమేశ్వరుడిని దర్శించుకున్న.... ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

కంఠమేశ్వరుడిని దర్శించుకున్న.... ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వరస్వామిలను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట స్థానిక సర్పంచ్ పరుశురాములు, ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, ఏసిపి రఘు చందర్, ఎస్సై శ్రావణ్ కుమార్ నాయకులు సట్ల రాములు, పల్లె రవి, లింగన్న బోయిన శ్రీనివాస్, బూర్ల శంకర్, మందపురం ఎల్ల గౌడ్, పొగాకు సోమయ్య, మంద రాజు, పిల్లి శీను, అనిల్, సెల్ కొమురెల్లి, నరసింహ రాములు, రాజశేఖర్, తోట వెంకన్న, చట్ల యాకయ్య, రాం నరసయ్య, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.