రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్తు సరఫరా ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండల కేంద్రాలలో బుధవారం దహనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ఆధ్వర్యంలో రైతు వేదికల ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రేఖ గట్టయ్య, సరిత బాలరాజు, జడ్పిటిసి రవి, మండల పార్టీ అధ్యక్షులు గణేష్, రమేష్ నాయక్, దేవస్థానం చైర్మన్ శ్రీధర్ రావు, ఆకుల కుమార్ ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.