పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

 ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: నేడు జరగనున్న గ్రూప్ - 4 పరీక్ష కేంద్రాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య పరిశీలించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లను కలెక్టర్ చెక్ చేశారు. ఆయన వెంట ఆర్డిఓ కృష్ణవేణి, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, సిఐ రాఘవేందర్, ఎంఆర్ఐలు అర్జున్, రవీందర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులున్నారు.