డ్రైనేజీ పనులు ప్రారంభించిన జడ్పీ చైర్మన్

డ్రైనేజీ పనులు ప్రారంభించిన జడ్పీ చైర్మన్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులను జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిల్పుర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మామిడాల లింగారెడ్డి, యంపిటిసి ఉమా సమ్మయ్య, మండల రైతు కో ఆర్డినేటర్ జనగాం యాదగిరి, మాజీ యంపిటిసి తాళ్లపెల్లి సంపత్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గజ్జెల దామోదర్, తాళ్లపల్లి జగన్నాథం వార్డ్ సభ్యులు తదితరులు ఉన్నారు.

“కెసిఆర్ ని విమర్శించే స్థాయి కాదు” 9 సంవత్సరం కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్ రెడ్డి అని అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీకి చోటు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల రైతు కోఆర్డినేటర్, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, డైరెక్టర్లు, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.