బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో..
![బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640c9d31af94a.jpg)
- జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి
ముద్ర ప్రతినిధి, జనగామ : ఎంపీ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారని జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పాగాల మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీది అని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రభుత్వం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలు మారాయని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా తాము బయపడే ప్రసక్తే లేదన్నారు.
అనంతరం బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్హెచ్వో శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జనగామ ఎంపీపీ, కలింగ రాజు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బైరగోని యాదగిరి గౌడ్, వారాల రమేశ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళ రాజు, వాంకుడోతు అనిత, పల్లవి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి సుల్తాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.