కార్యకర్తలు సైనికుళ్లా పనిచేయాలి
- తెలంగాణలో కాషాయం జెండా ఎగరేయాలి
- బెంగుళూరు ఎంపీ పీసీ.మోహన్
ముద్ర ప్రతిధిని, జనగామ : ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ బెంగుళూరు ఎంపీ పీసీ.మోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆరుట్ల దశమంత రెడ్డి అధ్యక్షతన జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ బీజేపీ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశమం నిర్వహించారు. ఈ మీటింగ్కు పీసీ మోహన్, జనగామ ఇన్చార్జి యాప సీతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గుండె విజయరావు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మోహన్ బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ప్రజలకు విరించడంతో పాటు కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, మాదాసి వెంకన్న, పార్టీ ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, మాచర్ల భిక్షపతి, బెజడి బీరప్పా, పవన్శర్మ, దేవర ఎల్లయ్య, కన్వీనర్ బల్ల శ్రీనివాస్, గుజ్జుల నారాయణ, హరిచంద్ర గుప్తా, సంపత్ కుమార్, అశోక్, కార్తీక్, వినోద్, క్రాంతి, జగదీష్, భాస్కర్, వెంకటేష్, ఘనపూర్, పాలకుర్తి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.