అశ్రునయనాల మధ్య మైనర్ల ప్రేమ జంటకు వేరువేరుగా వీడ్కోలు

అశ్రునయనాల మధ్య మైనర్ల ప్రేమ జంటకు వేరువేరుగా వీడ్కోలు

 దుబ్బాక ముద్ర అశ్రునయనాల మధ్య మైనర్ల అంత్యక్రియలు జరిగాయి. ఇంటర్ విద్యార్థులు మైనర్ లైన భగీరత్ నేహ ప్రేమను కుటుంబీకులు నిరాకరించడంతో ఊరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే , మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు పోలీసులు అప్పగించడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చ పేటలో మైనర్ యువకుడు కూరపాటి భగీరత్(17), దుబ్బాకలో యువతి తోట్ల నేహా(16) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి.ఈ అంత్యక్రియలకు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొని వారి కుటుంబాలను ఓదార్చారు.