ఘనంగా వారాల పోచమ్మ కల్యాణం

ఘనంగా వారాల పోచమ్మ కల్యాణం

ముద్ర, ముషీరాబాద్: గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ టీఅర్టీలోని శ్రీ వారాల పోచమ్మ దేవాలయ వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తజనుల సందోహం నడుమ అమ్మవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి కల్యాణానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ కార్పొరేటర్ ఏనుగు పావనిలు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు, కార్పొరేటర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందచేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ముడారపు రాకేష్ కుమార్(ఎం.ఆర్.కె), బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేష్, కార్యదర్శి పోతుల శ్రీకాంత్, లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా జైసింహ, ఆకుల శ్రీనివాస్, గడ్డమీద శ్రీనివాస్, కనకరాజు, శ్రీరామ్, ఏసు, రాము యాదవ్, బిజెపి నాయకులు ఏనుగు వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, నాయకులు సత్తి రెడ్డి, అరుణ్ కుమార్, ఆకుల అభిషేక్ వారాల పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.