అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన దుండిగల్ మున్సిపల్ చైర్మన్ శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ 

అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన దుండిగల్ మున్సిపల్ చైర్మన్ శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ 

ముద్ర, దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని 5వ వార్డులో బుధవారం రూ.15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న కుమ్మర సంఘం కమిటీ హాల్, 15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు పనులకు దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, ఆనంద్ కుమార్, జక్కుల క్రిష్ణ యాదవ్, గోపాల్ రెడ్డి, భారత్ కుమార్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తురి క్రిష్ణ, డైరెక్టర్ ఈ.శ్రీనివాస్, ఎక్స్ సర్పంచ్ కావలి గణేష్, మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, నాయకులు ఆకుల నర్సింగ్ రావు,  హనుమంత్ రెడ్డి, వీరాస్వామి, ముత్