మామిడికి ఎకరానికి రూ. 80 వేలు అందిచాలి
![మామిడికి ఎకరానికి రూ. 80 వేలు అందిచాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644a5e98568a0.jpg)
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తాసిల్దార్ కు బిజేపి వినతి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అకాల వర్షాలకు నష్టపోయిన మామిడి రైతులకు ఎకరానికి రూ. 80 వేలు, వరికి రూ . 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బిజేపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల బిజెపి అద్వర్యంలో పట్టణ తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణి గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున వారి ధాన్యం తడవగా, మామిడి నేలరాలిందని మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, జగిత్యాల పట్టణ, మండల అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, నలువల తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు ముద్రం రాము, జగిత్యాల్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పత్తి రామేశ్వరి, యువ మోర్చా అధ్యక్షులు హలో రవితేజ, దళిత మోర్చా మండల అధ్యక్షుడు తరాల మహేష్, తాటి పెళ్లి ఎంపీటీసీ పూదారి శ్రీనివాస్, పవన్ సింగ్, సుంకటి దశరథ రెడ్డి, కొక్కు గణేష్, మెరుగు ఉమేష్, పురెళ్ళ ప్రశాంత్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు