షార్ట్ సర్క్యూట్ తో  నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంత్రి ఈశ్వర్ పరమార్ష.

షార్ట్ సర్క్యూట్ తో  నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంత్రి ఈశ్వర్ పరమార్ష.
  • తక్షణ సహాయం కింద 30 వేలు అందజేత
  • ఇండ్లు మంజూరు చేసి, తల లక్ష అందించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి 

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గొండ గ్రామంలో  షార్ట్ సర్క్యూట్తో  పెసరి అశోక్, పెసరి పాండుల ఇండ్లు  కాలిపోగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం వారి కుటుంబాలను పరామర్శించారు. తక్షణ సహాయంగా 30 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. షార్ట్ సర్క్యూట్ తో నిరాశ్యులైన   వారిని  ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాతో ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరికి ఇండ్లు మంజూరు చేసి, తల లక్ష అందించే  విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో     జెడ్పిటిసి బాదినేని రాజేందర్ వైస్ ఎంపీపీ సుచందర్, సర్పంచ్ తిరుపతి, నాయకులు రఘుపతి, లింగారెడ్డి,  నరేష్ తదితరులు పాల్గొన్నారు.