గాంధీనగర్ అభివృద్ధి పనులకు 10 లక్షలు
![గాంధీనగర్ అభివృద్ధి పనులకు 10 లక్షలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646a1e4e9919e.jpg)
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణం గాంధీనగర్ అభివృద్ధి పనులకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు( సిడిపి) నుండి పది లక్షల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను మెదక్ ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి ఆధ్వర్యంలో గాంధీనగర్ నాయకులకు అందించారు.
గాంధీనగర్ లోని బుడగ జంగాల బస్తి కమ్యూనిటీ హాల్ కి ఐదు లక్షల రూపాయలు, మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ కి ఐదు లక్షల రూపాయలు కేటాయించారు. గతంలో గాంధీనగర్లో పర్యటించిన ఎమ్మెల్సీ బస్తీ వాసుల వినతి మేరకు పది లక్షల మంజూరుకు హామీనిచ్చిన స్వల్ప కాలానికే నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ బీఆర్ఎస్ నాయకులు సంగ నాగేందర్, కొంగోటి సత్యనారాయణ, సుంకరి రఘురాం, అవుసుల సత్యనారాయణ, బాజా మల్లేశం, నర్సింలు, గోపాల్, నాగరాజు, నర్సింగరావు, సార మురళి తదితరులున్నారు.