మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్
ముద్ర ప్రతినిధి, మెదక్: జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగ్గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. ఆదివారం సాయంత్రం మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని నిలిపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన కాన్వాయ్ లో హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.