విఘ్నేశ్వరుడి సేవలో ఎమ్మెల్యే పద్మ సూర్య గణేశుడి వద్ద హోమం

విఘ్నేశ్వరుడి సేవలో ఎమ్మెల్యే పద్మ సూర్య గణేశుడి వద్ద హోమం

ముద్ర ప్రతినిధి, మెదక్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మెదక్ పట్టణం జమ్మికుంట సూర్య గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శ్రీనివాస్, శంకర్ పంతులు, వేణు పంతులు ఆధ్వర్యంలో గణేష్ మండలి సభ్యులు, మహిళలతో కలిసి హోమంలో పాల్గొన్నారు. వినాయకుడి చల్లని చూపుతో ప్రజలంతా నిర్వీఘ్నంగా ఆయురారోగ్యాలతో, ధన ధాన్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా భక్తులకు అన్నదానం చేశారు. వెంట మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ జయరాజు, 
 గణేష్ మండలి సభ్యులు రాగం శ్రీనివాస్, రాములు సేట్, సంగమేశ్వర్, రాజు, వట్టం సంగమేశ్వర్, సూర్య గంగాధర్, రమేష్, రవి, గౌరీ, సంగ శ్రీకాంత్, కొత్త లక్ష్మి,  రాగి భాగ్యలక్ష్మి, రాజేష్, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.