ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన విద్యార్థి ఆత్మహత్య

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన విద్యార్థి ఆత్మహత్య

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన  ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్స్ బుజాలో ఈ ఘటన జరిగింది. మైహోమ్స్ బూజా జే బ్లాక్ పై నుంచి విద్యార్థి రేయాన్స్ రెడ్డి (14) కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రేయాన్స్ రెడ్డి ఖాజగూడలోని ఓ క్రిడ్జ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడిని తట్టుకోలేక రేయాన్స్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.