క్షయ వ్యాధిపై అవగాహన

క్షయ వ్యాధిపై అవగాహన

పెద్దశంకరంపేట, ముద్ర:పెద్దశంకరంపేట మండల పరిధిలోని మక్త లక్ష్మాపూర్ గ్రామంలో ఎంఎల్హెచ్పి శశివర్ధన్ ఆధ్వర్యంలో క్షయ వాది నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.  క్షయ వ్యాధిని దేశంగా పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, వ్యాధి నిరోధకానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శశివర్ధన్ అన్నారు. దగ్గు, దమ్ము లాంటి రోగాలు లక్షణాలతో జాగ్రత్త వహించడానికి మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత రమేష్, గ్రామ కార్యదర్శి గౌసియా, ఏఎన్ఎంలు రాణి, శివలీల, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.