ఎల్ జీ రాంకు నివాళులు అర్పించిన మంత్రి కేటిఆర్

ఎల్ జీ రాంకు నివాళులు అర్పించిన మంత్రి కేటిఆర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇటీవల ‌అనారోగ్యంతో మరణించిన ఉమ్మడి కరీంనగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్‌ . రమణ  తండ్రి స్వర్గీయ ఎల్‌ గంగారం (ఎల్ జీ రాం)  సంస్మరణ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్ లో నిర్వహించారు. ఈ  సంస్మరణ సభలో బిఆర్ ఎస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని  చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే  సుంకె రవి శంకర్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్,  జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్, జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, సర్పంచ్ లు ఎంపీటీసీ లు కౌన్సిలర్స్ లు, నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.