బిజెపి నేతల మధ్య సమన్వయం పెంపొందించెందుకే టిఫిన్ బైటక్

బిజెపి నేతల మధ్య సమన్వయం పెంపొందించెందుకే టిఫిన్ బైటక్

ముద్ర, జమ్మికుంట: భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సమన్వయం పెంపొందించేందుకే  టిఫిన్ బైటక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి తెలిపారు.  ఇల్లంతకుంటలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి టిఫిన్ బైటెక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ రెడ్డి మాట్లాడుతూ    అన్ని అసెంబ్లీ పరిధిలో నేతలంతా ఒక చోటుకు చేరి టిఫిన్,  భోజనం చేసేలా పార్టీ నాయకత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. టిఫిన్ బైట క్ క లో ఎవరి టిఫిన్ వారే తీసుకొని రావాల్సి ఉంటుందని , ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నేతల మధ్య యూనిటీ కోసం  ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా పదాదికారులు బింగి కర్ణాకర్, నరసింహ రాజు, ముత్యం రావు, జెళ్ల సుధాకర్, తుమ్మ శోభన్, శీలం శ్రీనివాస్, మండల అధ్యక్షులు జీడి మల్లేష్, రామిడి ఆదిరెడ్డి, గంగిశెట్టి రాజు,రాముల కుమార్, కట్కురి అశోక్ రెడ్డి,సర్పంచ్ లు గురుకుంట్ల సాంబన్న, నేరెల్ల మహేదంర్, ఎనగంటి శ్రీనివాస్,పెద్ది మల్లారెడ్డి, ఆకుల రాజేందర్, జడల శ్రీనివాస్, మారం తిరుపతి రెడ్డి, రావుల భాస్కర్ రెడ్డి, కెసిరెడ్డి విజేందర్ రెడ్డి, గొడుగు వినోద్, అరెల్లి శ్రీనివాస్, బీనవేని మహిపాల్ యాదవ్, మట్ట పవన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, ఇతర మోర్చా ల అధ్యక్షులు, వివిధ పదాధికారులు, బూత్ అధ్యక్షులు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.