ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
![ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ నాయకులు](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64e480837c55f.jpg)
చిగురుమామిడి ముద్ర న్యూస్:హుస్నాబాద్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల సతీష్ కుమార్ ను మూడో సారి ప్రకటించిన సందర్భంగా మంగళవారం మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేకు హైట్రిక్ విజయం కోసం సాయ శక్తుల కృషి చేస్తామన్నారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ తో పాటు జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజిత కృష్ణమా చారీ, కొత్త కైలాసం, పెద్దపల్లి రవీందర్, వంతడుపుల దిలిప్ కుమార్, మారెళ్ల కొమురయ్య, బిల్ల వెంకట్ రెడ్డి, గడ్డం అనిల్ కుమార్, కాశబోయిన నర్సయ్య తదితరులు ఉన్నారు.