10 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులుగా  ప్రత్యేక జీవో 

10 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులుగా  ప్రత్యేక జీవో 
  • మేయర్ యాదగిరి సునిల్ రావు 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ నగరపాలక సంస్థ లో నీటి విభాగం లో పని చేస్తున్న  10 మంది ప్రైవేటు ఉద్యోగులను ఎన్ఎంఆర్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. దీంతో సంబంధిత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మా నియామకంలో ప్రత్యేక చోరువ చూపిన మేయర్ యాదగిరి సునిల్ రావు ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్కోని మీరు పని చేస్తున్న విభాగంలో నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండ క్రమశిక్షణ, నిబద్దతతో భాద్యతయుతంగా పని చేయాలని ఆదేశించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తుందని తెలిపారు.