గణేష్ నిమజ్జనం ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనం ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు

ముద్ర,హుజురాబాద్: గణేష్ నిమజ్జోత్సవానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనకు అనుగుణంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సకాలంలో గణనాథులను నిమజ్జనానికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నిర్మల, సిఐ రమేష్,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.