పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచడమే బీజేపీ నైజం...
![పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచడమే బీజేపీ నైజం...](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6400a577eb79f.jpg)
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- సిలిండర్ ధరల పెంపుపై కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తాలో.. రాస్తారోకో..
- పాల్గొన్న ఎమ్మెల్యే
ముద్ర, మల్యాల: సిలిండర్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ... గురువారం కొడిమ్యాల మండలం పూడూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. కరీంనగర్ - జగిత్యాల ప్రధాన రహదారిపై బైటాయించి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. నిరసనలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. సిలిండర్ ఎత్తి ఎమ్మెల్యే నిరసన తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంచడానికి కారణమేంటో బీజేపీ ప్రజలకు చెప్పాలని అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర దోచి పెద్దలకు పంచుతున్నారని విమర్శించారు. వెంటనే గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎంపిపి, జడ్పిటీసి, తదితరులు పాల్గొన్నారు.