రోడ్డెక్కిన బీఆర్ఎస్

  • పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం
  • జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ/ స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రంలోని జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన నిరసనలో జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని  ధ్వజమెత్తారు.  పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ లీడర్లు రమణారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, కౌన్సిలర్లు బండ పద్మ, పేర్ని స్వరూప, వాంకుడోత్ అనిత, మల్లిగారి చంద్రకళ రాజు, పసుల ఏబేలు రాంమనోహర్, కందుకూరి ప్రభాకర్, మిద్దపాక లెనిన్, స్టేషన్ ఘన్ పూర్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, ఆకుల కుమార్, జ్యోతి రెడ్డి, చిగురు సరిత, చల్లా చందర్ రెడ్డి, గుండె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.