త్యాగాల స్ఫూర్తితో ముందుకు ...

త్యాగాల స్ఫూర్తితో ముందుకు ...

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్ర ప్రతినిధి,జనగామ: అమరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జనగామ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నేను పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో నేటి తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో త్యాగాలు చేశారని వారి త్యాగాలు స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి అన్నారు.

కలెక్టర్ శివలింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.