లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలి
![లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ace7d42020.jpg)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ పోచంపల్లి లేఖ
ముద్ర ప్రతినిధి, జనగామ : యాదాద్రి భువనగిరి జిల్లా వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని, ఎంఎంటీఎస్ రైల్వే లైన్, లోకల్ ట్రైన్ను మంజూరు చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయాలను చెప్పి ఒప్పించాలని కోరారు. జనగామకు లోకల్ ట్రైన్ వేస్తే రైల్వేకు లాభం, ప్రయాణికులకు సౌకర్యంవంతంగా ఉంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.