ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

సైదాపూర్.ముద్ర: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మసీదులో ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని అన్నారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని మతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకుందన్నారు. పేదింటి ముస్లిం యువతుల వివాహాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ షాది ముబారక్ ద్వారా లక్ష 116 రూపాయలను అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తొంట ఓదెలు, మాజీ సర్పంచ్ కనుకుట్ల విజయకుమార్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పూసాల అశోక్ ,నవీన్ ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.