గంగులను పరామర్శించిన వినోద్ కుమార్

గంగులను పరామర్శించిన వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి గ్రంథాలయ కమిటీ చైర్మన్ రఘువీర్ సింగ్ పరామర్శించారు. మంత్రి నివాసానికి వెళ్లి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూర్ గ్రామంలో వేదికపై నుండి పడిన ఘటనలో గంగుల కమలాకర్ కాలికి గాయమైన విషయం విధితమే.