పీఆర్సీ బకాయిలు చెల్లించాలి.. కార్మిక సంఘం అధ్యక్షురాలు మదురమ్మ

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి.. కార్మిక సంఘం అధ్యక్షురాలు మదురమ్మ

మెట్‌పల్లి ముద్ర:- కార్మికులకు పీఆర్సీ బకాయిలను చెల్లించాలని. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షురాలు మదురమ్మ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు ఎర్ర జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలని కోరారు. ఏఐటియుసి అధ్యక్షులు ఎండి ఉస్మాన్, ముజీబ్, నిజాం, పెద్ద పోచయ్య, బర్ల లింగం, జోగు సాయిలు ఉన్నారు.